జెండాకు అవమానమంటూ... షారుఖ్పై కేసు

ఈ విషయమై రవీంద్ర మాట్లాడుతూ....షారుఖ్ జెండా నియమాలు మరిచి కాషాయం రంగు కిందకి, ఆకుపచ్చ రంగు పైకి ఉంచి జెండా ఊపారని, ఇది జెండాను అవమానించడమే అని రవీంద్ర తెలిపారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఊరుకుంటే జెండా ఎగురవేసే నిబంధనలు అంతా మరిచి పోతారని, అందుకే షారుఖ్పై కేసు వేయాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిపారు.
రవీంద్ర బహ్మా ఇటీవల గెహ్నా వశిష్ట అనే మోడల్పై ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారు. జెండాను బికినీకి చుట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వశిస్ట్ త్రివర్ణ పతాకాన్ని అవమానించింది. జాతీయ జెండాను ఎవరు అవమానించినా ఊరుకునేది లేదని, వారిని కోర్టుకు ఈడ్చుడే అని రవీంద్ర తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











