Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ నెల్లోనే సందీప్ కిషన్-నిషా అగర్వాల్ ‘డికె బోస్’
హైదరాబాద్ : సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్'. నిషా అగర్వాల్ హీరోయిన్. ఎన్.బోస్ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్రంగా నిర్మాతలు. తాజాగా ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వీలైతే ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్లో కామెడీ పండించిన సప్తగిరి ఈచిత్రంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర పోషిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
కాగా...ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం "Groundhog day" ఆధారంగా రూపొందుతున్నట్లు టాలీవుడ్ లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రోజు ఆగిపోవటంతో నెగిటివ్ గా ఉన్న హీరోలో మార్పు వస్తుంది. అలాంది కథే... 'డీకే బోస్' అంటున్నారు. నిజానిజాలు విడుదల అయితే కానీ తెలియవు.
నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.
దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్ఆఫీసర్గా గోల్డ్మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు. ఈ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు.