Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
షాకిస్తున్న ప్రభాస్ 'సాహో' స్టోరీ.. మళ్ళీ పుడతాడా, అంతా అనుకుంటున్నట్లు కాదు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్కు నేషనల్ లెవల్లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించిన విశేషాలు బయటపడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాహో చిత్ర కథ గురించి ఆంగ్ల మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
రహస్యంగా
సాహో చిత్ర యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. సుజిత్ కానీ, ఇతర చిత్ర యూనిట్ కానీ సాహో కథ గురించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ప్రభాస్ వజ్రాల దొంగ అంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. కానీ సాహో చిత్రం అనగానే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంతా భావిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకోసమే కాదు
సాహో చిత్రంలో ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు మునెపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న వార్తల ప్రకారం సుజిత్ ఈ చిత్రాన్ని యాక్షన్ సన్నివేశాల కోసం చేయడం లేదని.. ఎవరూ ఊహించని విధంగా బలమైన కథ ఉందని అంటున్నారు. అందరిని ఆశ్చర్యపరిచేలా సాహో చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని తాజా సమాచారం.
రివేంజ్ డ్రామా
సాహో చిత్రంలో మరణించి మళ్ళీ జన్మించిన ప్రభాస్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. సాహో చిత్రంపై ఆసక్తిని పెంచేస్తున్న ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తేలాలంటే చిత్ర యూనిట్ స్పందించాలి. సినిమా విడుదలకు ముందే సాహో కథ గురించి చిత్ర యూనిట్ విశేషాలు తెలియజేస్తుందా లేక విడుదల వరకు సస్పెన్స్ కొనసాగిస్తుందా అనేది ఎదురు చూడాల్సిన అంశం.
శ్రద్దా కపూర్
తొలిసారి తెలుగు హీరో సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది కూడా ఆసక్తికర అంశం. నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, అర్జున్ విజయ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగష్టు 15న సాహో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది.