Don't Miss!
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సునీల్కి నో... వెల్ కమ్! : మంచు విష్ణు ట్వీట్
హైదరాబాద్ : ప్రముఖ నటుడు మోహన్ బాబు, హీరో సునీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోందని, బాలీవుడ్ మూవీ 'వెల్ కమ్' చిత్రానికి రీమేక్ గా ఈచిత్రం రూపొందనుందని, 'లక్ష్యం' చిత్రం ఫేమ్ శ్రీవాసు ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారని...ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతున్న ప్రచారాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం.
తాజాగా ఈ ప్రచారంపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు స్పందించారు. శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్ బాబు నటిస్తున్న విషయాన్ని దృవీకరించారు. ఈ చిత్రాన్ని తానే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బేనర్ పై తానే నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు. అయితే ఇందులో సునీల్ నటిస్తున్న వార్తలను మాత్రం విష్ణు ఖండించారు.
ఈ విషయమై విష్ణు తన ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. 'మా నాన్న(మోహన్ బాబు) xyzతో కలిసి నటిస్తున్నట్లు వస్తున్న రూమర్లను నమ్మవద్దు. నాన్న తర్వాత సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈచిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు' అంటూ విష్ణు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరో వైపు మోహన్ బాబు ప్రధాన పాత్రలో విష్ణు 'రావణ బ్రహ్మ' అనే సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన మంచు విష్ణు ప్రస్తుతం ఏ చిత్రంలోనూ నటించడం లేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన వివాదాల నేపథ్యంలో కోర్టుల చుట్టు తిరుగుతున్నాడు ఈ హీరో.