twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగల బండి దర్శకుడి ‘కులుమనాలి’

    By Bojja Kumar
    |

    నలభై మూడు చిత్రాలకు కథా రచయితగా పనిచేసి దొంగలబండి, రామదండు చిత్రాలను తెరకెక్కించిన వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'కులుమనాలి" పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్, కృష్ణుడు, శశాంక్, అర్చన , సమీక్ష , అక్షయ్, రీతుకౌర్ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు.

    ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "చక్కటి కథాంశంతో రూపొందనున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నవంబర్ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి అక్కడే తొలి షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది''అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న పూర్తి కమర్షియల్ చిత్రమిది. ఇప్పటి వరకు థ్రిల్లర్ చిత్రాలు అనగానే హౌస్, ఫారెస్ట్ నేపథ్యంలోనే ఉంటాయి. తొలిసారిగా కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ను తెరకెక్కించనున్నాం'' అని చెప్పారు.

    ఈ చిత్రంలో ఖయ్యిం, హర్షవర్థన్, గౌరీశర్మ, వర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కెమెరా: జి.శివకుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: నిలీమ, కూర్పు: బస్వా పైడిరెడ్డి.

    English summary
    Archana, Sameeksha, ReetuKour and Akashay are featuring as main leads in a new movie 'Kulumanali' under writer turned director Sateesh Vegesna. Boppana Chandrasekhar producing this movie on Jahnavi productions banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X