Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
దొంగల బండి దర్శకుడి ‘కులుమనాలి’
నలభై మూడు చిత్రాలకు కథా రచయితగా పనిచేసి దొంగలబండి, రామదండు చిత్రాలను తెరకెక్కించిన వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'కులుమనాలి" పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్, కృష్ణుడు, శశాంక్, అర్చన , సమీక్ష , అక్షయ్, రీతుకౌర్ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "చక్కటి కథాంశంతో రూపొందనున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నవంబర్ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి అక్కడే తొలి షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే మరో షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది''అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందనున్న పూర్తి కమర్షియల్ చిత్రమిది. ఇప్పటి వరకు థ్రిల్లర్ చిత్రాలు అనగానే హౌస్, ఫారెస్ట్ నేపథ్యంలోనే ఉంటాయి. తొలిసారిగా కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్డ్రాప్లో జరిగే థ్రిల్లర్ను తెరకెక్కించనున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రంలో ఖయ్యిం, హర్షవర్థన్, గౌరీశర్మ, వర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కెమెరా: జి.శివకుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: నిలీమ, కూర్పు: బస్వా పైడిరెడ్డి.