Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దొంగల బండి దర్శకుడి ‘కులుమనాలి’
నలభై మూడు చిత్రాలకు కథా రచయితగా పనిచేసి దొంగలబండి, రామదండు చిత్రాలను తెరకెక్కించిన వేగేశ్న సతీష్ దర్శకత్వంలో 'కులుమనాలి" పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్, కృష్ణుడు, శశాంక్, అర్చన , సమీక్ష , అక్షయ్, రీతుకౌర్ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "చక్కటి కథాంశంతో రూపొందనున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నవంబర్ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి అక్కడే తొలి షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగే మరో షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది''అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందనున్న పూర్తి కమర్షియల్ చిత్రమిది. ఇప్పటి వరకు థ్రిల్లర్ చిత్రాలు అనగానే హౌస్, ఫారెస్ట్ నేపథ్యంలోనే ఉంటాయి. తొలిసారిగా కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్డ్రాప్లో జరిగే థ్రిల్లర్ను తెరకెక్కించనున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రంలో ఖయ్యిం, హర్షవర్థన్, గౌరీశర్మ, వర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కెమెరా: జి.శివకుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: నిలీమ, కూర్పు: బస్వా పైడిరెడ్డి.