Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'దూకుడు' పంక్షన్ పై అపీషయల్ ప్రకటన
మహేష్ 'దూకుడు'చిత్రం యాభై రోజుల పంక్షన్ వివరాలతో నిర్మాతలు అఫీషయల్ గా ప్రకటన చేసారు.వారి మాటల్లో.. "ఎనభై ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లతో, అత్యధిక కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటూ అన్ని రికార్డుల్ని తిరగరాసిన 'దూకుడు' చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో ఈ నెల 12 సాయంత్రం 5 గంటలకు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో వైభవంగా జరుపుతున్నాం.ఈ వేడుకలో చిత్రసీమ అతిరథ, మహారథులతో పాటు సినిమా యూనిట్ అంతా పాల్గొంటుంది.'దూకుడు'కు అఖండ విజాన్ని అందించి ఇండస్ట్రీ నెంబర్వన్ గ్రాసర్గా నిలిపిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు''అని చెప్పారు. మహేశ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'దూకుడు' చిత్రాన్ని జి. రమేశ్బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించారు.
ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు.అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక దూకుడు ఓ రేంజి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.. ప్రతీ రోజు మీడియాలో వీటికి సంభందించిన వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కొందరు కావాలని హైప్ క్రియోట్ చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు.అయితే మహేష్ తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ..ఇది అపీషయల్..దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్..అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఇక యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం అన్ని వర్గాలని ఆకట్టు కోవటంతో దాదాపు అందరూ మొదటి రెండు వారాల్లోనే ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు.