Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ దూకుడుతో దిక్కుతోచనన్ని ఆఫర్లు...!?
ఏ మాయ చేసావె, బృందావనం, దూకుడు.. ఇలా తను నాయికగా నటించిన మూడు చిత్రాలు విజయాలు సాధించడంతో 'దూకుడు" మీద వున్న సమంతకు ఇప్పుడు టాలీవుడ్లో డిమాండ్ పెరిగింది. గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ వున్న పాత్రలను చేసే అరుదైన నాయికల జాబితాలో స్థానం సంపాందించుకున్న సమంత వైపు దర్శక, నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె" చెట్టు చిత్రంలో జతకడుతున్న ఈ భామ రాజమౌళి 'ఈగ"తో పాటు నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య"లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందనున్న చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనుంది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో అరుదైన అవకాశం లభించింది. యువ కథానాయకుడు అల్లు అర్జున్, 'బొమ్మరిల్లు" భాస్కర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో సమంత నాయికగా ఎంపికైనట్లు తెలిసింది. శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్ళనుంది.