Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అల్లు అర్జున్ కి పోటీగా మహేష్ బాబు
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు మొన్న శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ చిత్రాన్ని మళకయాళంలో రీమేక్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ కేవలం అల్లు అర్జున్ సినిమాలకే అక్కడ మంచి మార్కెట్ ఉండేది. ఈ దెబ్బతో మహేష్ కూడ మళయాళంలో జెండా పాతుతాడంటున్నారు. అతను దూకుడుని డబ్ చేసి ఎక్కువ ప్రింట్లతో మళయాళంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఇక ఆర్య2, పరగు కూడ అక్కడ మంచి మార్కెట్ ని క్రియోట్ చేయటంతో ఇప్పుడు తెలుగు హీరోల చాలా మంది దృష్టి మళయాళంపై ఉంది. తమిళం వైపుకు వెళదామంటే ఇప్పటికే అక్కడ విడుదలైన మగధీర,శక్తి,అతడు అంతంత మాత్రంగా ఆడాయి. దాంతో అక్కడ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇక మళయాళంలో దూకుడు బాగా ఆడితే మహేష్ పాత తెలుగు చిత్రాలను కూడా అక్కడ డబ్ చేసి విడుదల చేయాలని మిగతా నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైంది ఎన్నడూ లేని విధంగా. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు, సమంత జంటగా నటించిన దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.