Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి నరేష్ చేయనున్నారు.భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం మంచి కథ సిద్ధం చేశామని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తామని నిర్మాత పేర్కొన్నారు.ఇది తన కెరీర్లో వెరైటీ సినిమా అవుతుందని నరేష్ చెబుతున్నారు. ఈ ఏడాది పోరాళీ అనే చిత్రం ద్వారా తమిళ్ తెరకు కూడా నరేష్ పరిచయం కాబోతున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక అనీల్ సుంకర గతంలో బిందాస్, అహ నా పెళ్లంట,నమో వెంకటేశ చిత్రాలను నిర్మించారు. వీరభద్ర చౌదరి దర్సకత్వంలో రూపొందిన అహనా పెళ్లంట చిత్రంలో అల్లరి నరేష్ నటించారు. ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన మడతకాజా విడుదలైంది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.
అల్లరి నరేష్ తన తమిళ చిత్రం గురించి చెబుతూ..."తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో 'పోరాళి' చేస్తున్నాను. అక్కడ నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నా చిత్రాల బడ్జెట్ రూ. 5.5 - 6 కోట్లు ఉంటుంది. అదే తమిళ మార్కెట్ జత చేరితే నిర్మాతకు రూ.కోటి లాభముంటుంది అన్నారు. ఇక తాను చేయబోయే తదుపరి చిత్రాలు గురించి చెబూతూ...నారాయణ దర్శకత్వంలో శర్వానంద్, శ్రియ, నేను కలిసి చేసే సినిమా త్వరలో ఉంటుంది. భీమినేని దర్శకత్వంలో ఓ చిత్రం దసరాకు మొదలవుతుంది. దేవిప్రసాద్, చందు, సత్తిబాబు చిత్రాలున్నాయి. ఇవిగాక మరో పెద్ద చిత్రముంది. త్వరలో ప్రకటిస్తాను అన్నారు. మడతకాజా గురించి చెబుతూ.."సీమటపాకాయ్లో లాగా ఈ చిత్రంలోనూ సెంటిమెంట్ ఉంటుంది. కవిత, నేను కలిసి చేసిన సెంటిమెంట్ సీన్లు హృద్యంగా ఉంటాయి. ఏ ఆర్టిస్టుకైనా కామెడీ చేయడం చాలా కష్టం. సినిమాను ప్రేమించే వారెవరూ కామెడీ నచ్చదని చెప్పరు. అక్షయ్కుమార్ లాంటి యాక్షన్ హీరోలు కూడా కామెడీతో స్టార్డమ్ను సొంతం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కామెడీ చేసే హీరోలు సెంటిమెంట్ సీన్లు చేస్తే ప్రేక్షకులు వెంటనే ఒప్పుకుంటారు. 'గమ్యం'లో గాలిశీను పాత్ర కూడా అందుకే చాలా త్వరగా ఎక్కింది అన్నారు.