Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'దూకుడు' నిర్మాత డైరక్షన్ ఉగాది రోజే
మహేష్ బాబుతో దూకుడు వంటి మెగా హిట్ చిత్రం ఇచ్చిన నిర్మాత అనీల్ సుంకర త్వరలో దర్శకుడు అవతారం ఎత్తుతున్నారు. అల్లరి నరేష్, కిక్ శ్యామ్, రాజు సుందరం, వైభవ్ ప్రధాన పాత్రలుగా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని త్రిడీ ఫార్మెట్ లో తెరకెక్కించనున్నారు. ఇందుకోసం యుఎస్ ఎ నుంచి సాంకేతిక నిపుణులు వస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ గా కామ్నా జట్మలానీ, విమలా రామన్, స్నేహా ఉల్లాల్ నటించనున్నారు. ఈ ప్రారంభోత్సవం చెన్నై సిటీలో చేస్తున్నారు. ఈ చిత్రం ఉగాది రోజు ప్రారంభమవుతుంది.
గతంలో ఈ నిర్మాత అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట చిత్రం నిర్మించారు. పూల రంగడు దర్శకుడు వీరభద్రమ్ డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రం బాగా ఆడింది. ఇక ప్రస్తుతం ఈ నిర్మాతలు సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం ఓపెనింగ్ ఆ మధ్యనే మొదలైంది. ఇందులో మహేష్.. లెక్చరర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ధ్రిల్లర్ గా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.