twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యాగజైన్ పై'దూకుడు'నిర్మాత కంప్లైంట్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు.ఈ చిత్రం లో స్టిల్స్ ని తాము అఫీషియల్ గా ప్రకటించకుండా సంతోషం మ్యాగజైన్ వారు పబ్లిష్ చేసారని ఫిల్మ్ ఛాంబర్ లో దూకుడు నిర్మాతలు కంప్లైంట్ చేసారని సమచారం.ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక 'దూకుడు'చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. 'దూకుడు' పాటల్ని ఆగస్టు 18న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో తెలిపారు.

    ఈ విషయాన్ని చెప్తూ మహేష్ ..''దూకుడు పాటలు బాగా వచ్చాయి. తమన్‌ మంచి సంగీతాన్ని అందించారు. 18న పాటలు విడుదల చేస్తాం. మీలాగే నేను కూడా ఆరోజు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొన్నారు. ఇటీవల 'దూకుడు' ట్రైలర్స్ ని విడుదల చేశారు. దేనికీ తలవంచని ఓ యువకుని కథ ఇది. అతని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా అందుకొన్నాడు? అనే విషయాల్ని ఆసక్తిగా చూపిస్తున్నాం అని యూనిట్ వారు చెబుతున్నాయి. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    English summary
    The producers of Dookudu have approached the Producers Council, to take action against Santosham magazine. The tiff started due to a photo published in Santosham magazine on the eve of Mahesh Babu’s birthday. The producers allege that the magazine has violated their rights as they have not yet released that picture officially.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X