Don't Miss!
- News జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
మహేష్-తమన్నాల డబుల్ మిల్క్ కాంబినేషన్ సూపర్...!
'శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఢీ" చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది ! 'ఢీ" చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్బాయ్ లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్ లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే.
ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి. అయితే తాజాగా ఈ మిల్క్ బాయ్ తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్ బాయ్, మిల్కీవైట్ భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల '100% లవ్"తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు. ఇటీవలే మహేష్ తో 'దూకుడు" వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ ఓ వైవిధ్యమైన గెటప్ లో కనిపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ వార్త. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రంలో మహేష్ తో జోడి కట్టే అవకాశం రావడం పట్ల తమన్నా ఎంతో హ్యాపీగా వుందట. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న తొలిచిత్రమిది కావడమే ఇందుకు కారణం.