Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శర్వానంద్ భుజంలో తీవ్రగాయం.. 8 గంటల సర్జరీ సక్సెస్.. డాక్డర్ గురవారెడ్డి వెల్లడి
థాయ్లాండ్లో 96 మూవీ షూటింగ్లో యువ హీరో శర్వానంద్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణలో భాగంగా స్కై డైవింగ్ కోసం శిక్షణ తీసుకొంటున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. దాంతో భుజానికి, కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. బ్యాంకాక్లో ప్రథమ చికిత్స జరిపించి, ఆ తర్వాత హైదరాబాద్కు తరలించారు. ఆయనకు సోమవారం (జూన్ 17) రోజున సన్షైన్ ఎండీ గురువారెడ్డి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సర్జరీ జరిగింది.
శర్వానంద్ సర్జరీపై డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ.. శర్వానంద్తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటాను. దురదృష్టవశాత్తు థాయ్లాండ్లో జరిగిన ప్రమాదంలో తన షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆ ఫ్రాక్చర్ ఐదారు ముక్కలుగా అయ్యింది. మా హాస్పిటల్లో చేరగానే సంబంధింత పరీక్షలు చేశాం. సోమవారం వైద్య బృందం కమలాకర్, సుబ్రమణ్యం, చంద్రశేఖర్, ప్లాస్టిక్ సర్జన్ భవానీ ప్రసాద్, ఎనస్తటీషియా గిరిధర్ సహా నా ఆధ్వర్యంలో ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స, అనంతరం మూడున్నర గంటలు అబ్జర్వేషన్లో పెట్టాం. బోన్ ఫ్రాక్చర్ ఐదారు ముక్కలుగా ఉండటం వల్ల చాలా టైం పట్టింది. అయితే ఆపరేషన్ సక్సెస్ను ఫుల్గా పూర్తి చేశాం అని తెలిపారు.
కుడి భుజం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. మామూలు స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తాం. ఇది కాకుండా కాలిలో ఓ చిన్న ఫ్రాక్చర్ ఉంది. దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ఈరోజు ఐసీయూ నుంచి రూమ్కు షిఫ్ట్ చేశాం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. ఈ రెండు గాయాలు తప్ప.. మరే సమస్యలు లేవు. శర్వానంద్ త్వరగానే కోలుకుంటారు అని గురువారెడ్డి అన్నారు.