Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అభిషేక్
హైదరాబాద్:
తెలుగు
సినీ
నటుడు
అభిషేక్
డ్రగ్స్తో
పోలీసులకు
రెడ్
హాండెడ్గా
పట్టుబడిన
సంగతి
తెలిసిందే.
తాజాగా
ఈ
రోజు
పోలీసులు
మీడియా
సమావేశం
ఏర్పాటు
చేసి
ఈ
కేసుకు
సంబంధించిన
వివరాలను
వెల్లడించారు.
వెస్ట్
జోన్
డీసీపీ
సుధీర్
బాబు
ఈ
కేసు
విషయమై
మాట్లాడుతూ....
అభిషేక్
డ్రగ్స్
దందా
నడుతున్నాడని
తెలిపారు.
అభిషేక్కు గోవాలో హోటల్ ఉందని, అక్కడ డ్రగ్స్ ముఠాలతో పరిచయం ఏర్పరుచుకుని అక్కడి నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడని. వాటిని హైదరాబాద్ లోని పబ్లకు, సినీ ప్రముఖులకు సరఫరా చేస్తున్నాడని వెల్లడించారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు అతను డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.
అభిషేక్ 'డేంజర్' చిత్రంతో పాటు, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసాడు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాక పోవడంతో గోవా వెళ్లి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. టాలీవుడ్లో చాలా మంది డ్రగ్స్ కోసం వెంపర్లాడుతుండటంతో.... ఇదే అదునుగా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన అభిషేక్ గోవాలో డ్రగ్స్ కొని వాటిని హైదరాబాద్ తీసుకొస్తున్నాడు. తనకు సినీరంగంలో పరిచయాలు ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేస్తున్నాడు.
హైదరాబాద్లో డ్రగ్స్ మూలాల్ని పూర్తిగా తొలగించేందుకు పోలీసు శాఖ కృష్ణి చేస్తోందని... సిఐడి ఉన్నతాధికారి కృష్ణ ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇంతలోనే అభిషేక్ పట్టుబడటం చూస్తుంటే పోలీసులు సీరియస్ గా డ్రగ్స్ దందాపై దృష్టి సారించినట్లు స్పష్టం అవుతోంది.