Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బన్నీ-త్రివిక్రమ్ మూవీ: కొత్త పాప్ సింగర్తో దేవిశ్రీ...
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఆ మధ్య ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంతో అపాచె ఇండియన్ అనే పాప్ సింగర్ ను టాలీవుడ్కి పరిచయం చేసిన దేవిశ్రీ ప్రసాద్....తాజాగా అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి మరో పాప్ సింగర్ను పరిచయం చేయబోతున్నారు.
ప్రముఖ ఫోక్, ఫుషన్ సింగర్ రఘు దీక్షిత్ను దేవిశ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. ఇటీవల అతని సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని రఘు దీక్షిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అల్లు అర్జున్ సినిమా కోసం కంపోజర్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఓ కికాస్ సాంగ్ రికార్డు చేసాం. అతనితో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది' అంటూ ట్వీట్ చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమాకు
సంబంధించిన
వివరాల్లోకి
వెళితే...
ఈచిత్రంలో
సమంత,
నిత్యామీనన్,
అదాశర్మ
హీరోయిన్స్.
కన్నడ
స్టార్
ఉపేంద్ర,
రాజేంద్రప్రసాద్,
స్నేహ
కీలక
పాత్రలు
పోషిస్తున్నారు.
ఇతర
పాత్రల్లో
సింధుతులాని,
వెన్నెల
కిషోర్,
బ్రహ్మానందం,
ఎం.ఎస్.నారాయణ,
రావ్
రమేష్
నటిస్తున్నారు.
జులాయి
తర్వాత
బన్నీతో
చేస్తున్న
సినిమా
కావడంతో
అంచనాలు
భారీగా
ఉన్నాయి.
వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.