twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తాజ్‌టెర్రర్‌' వెండి తెరపై

    By Staff
    |

    Taj Terror
    ముంబయి మారణహోమం నేపథ్యంలో 'తాజ్‌ టెర్రర్‌' అనే చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాల్లో బాలీవుడ్‌ దర్శకుడు బి.సుభాష్‌ నిమగ్నమయ్యారు. అయితే కీలకమైన కసబ్‌ పాత్రకు దుబాయి నటుడు అజీజ్‌ను ఎంపిక చేసినట్లు ది మజాల అనే పేరుతో ప్రచురితమయ్యే దుబాయ్ మేగజైన్‌ కథనాన్ని ప్రచురించింది. అమరవీరుడైన కమాండో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రకు షారూక్‌ఖాన్‌, జాన్‌అబ్రహంను కమాండో దళాధిపతి పాత్రకు ఎంపికచేయాలని అనుకుంటున్నట్లు సుభాష్‌చెప్పారు. ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా మిథున్‌ చక్రవర్తిని ఎంచుకున్నామని తెలిపారు.

    యువకుడైన అజీజ్ దుబాయ్ లో పెరిగి ముంబయికి నాలుగేళ్ళ క్రిందట తన బాలీవుడ్ కల నెరవేర్చుకోవటానికి వచ్చారు. అయితే అతన్ని టెర్రరిస్టు కసబ్ పాత్ర వరిస్తుందని ఊహించలేదు. మొదట అటువంటిది చేయటం ఇష్టం లేకపోయినా నటుడన్నవాడు ఏదైనా చేయాలని దర్శకుడు సుభాష్ మాటలు తనని ప్రేరేపించాయంటున్నారు. అజీజ్ గతంలో రాజశ్రీ వారి ఉఫ్ క్యా జాదూ మొహబ్బత్ హై అనే సినిమాలోనూ,వీరస్వామి అనే తమిళ చిత్రంలోనూ,లవర్స్ లైక్ అజ్ అనే ఇంగ్లీష్ చిత్రంలోనూ ప్రముఖ పాత్రలను పోషించాడు. అయితే ఇప్పటివరకూ బ్రేక్ రాలేదని ఈ సినిమాతో తన కెరీర్ ముందుకెల్తుందని భావిస్తున్నానంటున్నాడు.

    బి.సుభాష్ గతంలో మిధున్ చక్రవర్తితో ఎన్నో మ్యూజికల్ హిట్ డాన్స్ ఫిల్మ్స్ తీసారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ నా సినిమా ఆ రోజు జరిగిన మారణ హోమంలో సమయంలో ప్రజల ఎమోషన్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.అందుకే నా స్క్రిప్టు మొత్తం వందలమంది ముంబయి ప్రేలుళ్ళ బాధితుల మనోగతాలనుంచి సేకరించిన అంశాలతో నింపాను అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X