Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ హీరోలపై ఆగని వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు...
సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు" రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమపై ఈ చిత్రం సెటైర్లు వేయనుంది. హీరోలపై కూడా రామూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాడట. స్టార్ హీరోలపై సెటైర్ల కోసం రామూ ఆ హీరోలు పోలికలున్న డూప్ లను వాడుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ల పోలికలతో డూప్ లు ఉన్నారు. ఈ డూప్ హీరోలు హీరోలుగా ఏకంగా ఆ మధ్య ఓ సినిమా కూడా చేశారు. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు రామూ దర్శకత్వంలో చేయడం వారికి జాక్ పాట్ లాంటి అవకాశం అని చెప్పొచ్చు. ఈ డూప్ హీరోలందరూ ఓ ప్రముఖ టివి ఛానెల్ లో రియాల్టీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్ర ఆడియో వేడుక సోమవారం రాత్రి తాజ్ బంజారా హొటల్ లో జరిగింది. సినిమాలో ఆరు పాటలు ఉండగా ఇందులో ఒక పాటతో సిడిని రూపొందించి దాన్ని విడుదల చేశారు. ఆడియో విడుదలలో విభిన్నమైన పద్దతిని అనుసరిస్తూ ఇలా చేయడం చిత్రపరిశ్రమలో ఇదే ప్రధమం. ప్రతి సోమవారం ఒక్కో పాట చొప్పున ఇలా ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. హీరోలకు కొత్త స్టైల్ ని హీరోయిన్స్ కి కొత్త లుక్ ని దర్శకుడిగా తను ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నది అప్పల్రాజు వివరించడం ఈ పాట ప్రత్యేకత.