Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అనుష్క కూడా ఓ రాయి విసురుతోంది
హైదరాబాద్: సౌత్ లో హీరోయిన్ గా ఓ స్ధాయికి వెళ్లిన వాళ్లంతా బాలీవుడ్ పై కన్నేయటం సహజం. అక్కడ సక్సెస్ అయితే అవుతాం..లేదా మన సౌత్ సినిమాలు ఉండనే ఉన్నాయి...అనేది వారి ఆలోచన. బాలీవుడ్ లో నటిస్తే దేశం మొత్తం పాపులర్ అవుతామనేది వారి ఆలోచన. త్రిష,అశిన్, కాజల్, తమన్నా రూటులోనే ఇప్పుడు అనుష్క కూడా బాలీవుడ్ ప్రయాణం పెట్టుకుందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే...అనుష్క ఓ బాలీవుడ్ సినిమాను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'అమన్ కి ఆశ' చిత్రాన్ని రూపొందించిన ఇ.నివాస్ తన తదుపరి చిత్రంలో అనుష్కను బాలీవుడ్కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
''నేను అనుష్కకు ఓ కథ వినిపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అనుష్క నుంచి ఓకే అనే మాట వచ్చాకే చెప్పగలను. ఈ కథకు అనుష్క వందశాతం సరిపోతుందని ఆమెను సంప్రదించాను. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రావచ్చు''అని చెప్పారాయన.
సినిమా గురించి చెబుతూ ''ఈ చిత్రానికి 'జువీనల్' అనే పేరు ఖరారు చేశాం. మల్టీస్టారర్ చిత్రం. మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. భిన్న కథల సమ్మేళనంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది''అని చెప్పారు నివాస్. అనుష్క ప్రస్తుతం 'బాహుబలి' చిత్రీకరణలో బిజీగా ఉంది.