Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంగోపాల్ వర్మకు మరో షాక్.. లక్ష్మీస్ ఎన్టీఆర్కు ఎదురుదెబ్బ.. ఆంధ్రాలో రిలీజ్ కాకుండా..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో చోటుచేసుకొన్న కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా బయోపిక్ చిత్రాల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దాంతో ఆంధ్రాలో మరో రెండు నెలలు ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..
పీఎం నరేంద్రమోదీ, లక్ష్మీస్ ఎన్టీఆర్కు చుక్కెదురు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం నరేంద్రమోదీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలపై వివాదం కొనసాగుతున్నది. పీఎం నరేంద్రమోదీ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ను ఏపీలో రిలీజ్ కాకుండా ఆపాలనే టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్లను పరిశీలించిన ఈసీ దేశవ్యాప్తంగా బయోపిక్లపై నిషేధం విధించింది.
ఎన్నికల సమయంలో నిషేధం
బయోపిక్ చిత్రాల నిషేధంపై ఈసీ వివరణ ఇస్తూ.. ఏ రాజకీయ పార్టీకి, లేదా ఏ వ్యక్తి జీవితానికి సంబంధించిన ఏ బయోపిక్ను ఎన్నికల సమయంలో విడుదల చేయడానికి వీలు లేదు. ఈసీ ఆంక్షల నేపథ్యంలో సినిమాను ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ, సినిమాటోగ్రాఫ్ను గానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాల్లో ప్రసారం చేయకూడదు అని స్పష్టం చేసింది.
ఎన్నికల కోడ్ ఉన్నంత సేపు
ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ఏపీలో విడుదలకు నోచుకోదు. వచ్చే 40 రోజులు అంటే ఎన్నికల ఫలితాలు పూర్తయ్యేంత వరకు ఈ చిత్రం విడుదల కాకుండా ఈసీ నిర్ణయం ప్రకటించింది.
పైరసీ కోరల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ
ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నైజాం, తమిళనాడు, కర్ణాటకలో ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఓవర్సీస్లో మెరుగైన వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. రిలీజ్ కోసం మళ్లీ 40 రోజులు ఆగితే ఈ సినిమా పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది.