Don't Miss!
- News
ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
- Sports
Ricky Ponting : ఒకప్పటి ఆస్ట్రేలియా యోధులతో రికీ పాంటింగ్ ఫోటో.. వార్నర్, పంత్ కామెంట్లు
- Automobiles
దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
- Lifestyle
గుండె జబ్బులకు కారణమేమిటో తెలుసా?
- Finance
Bank FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు ఇవే.. వీటిలో పెట్టుబడి పెట్టండి..
- Technology
ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
లేడి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. వివాదంగా మారిన సాంగ్, తెలంగాణ ఎమ్మెల్యే రంగంలోకి!
ఈ శుక్రవారం మూడు చిత్రాలు తెలుగు తెరపైకి వచ్చాయి. విక్రమ్ నటించిన సామి, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో పాటు చిన్న చిత్రం వచ్చిన ఈ మాయ పేరేమిటో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మాయ పేరేమిటో చిత్రం వివాదం చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ పాట హిందువుల మనోభావాలకు వ్యతిరేంగా ఉందని వివాదం మొదలయింది. ఆ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనోభావాల్ని కించపరిచేలా
ఈ చిత్రం నిన్న విడుదల కాగానే తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఈ చిత్రంలోని అరిహంతానం అనే పాట హిందువుల మనోభావాల్ని కించేపరిచేలా ఉందని ఆయన సెన్సార్ చైర్మన్ జోషికి లేఖ రాశారు. ఆ లేఖ ఆయనకు అందింది.

తొలగించాలని
ఆపాటలో ఉన్న వివాదాస్పద లిరిక్స్ ని తొలగించాలని నెల రోజుల క్రితమే హెచ్చరించినట్లు రాజా సింగ్ తెలిపారు. అయినా కూడా సినిమాని అదే విధంగా విడుదల చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. చాలా మంది నుంచి ఈ పాట తొలగించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.

స్పందించిన నిర్మాత
ఈ మాయ పేరేమిటో చిత్రంలో సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. ఆయన కుమార్తె దివ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. పాట వివాదం కాగానే ఆ లిరిక్స్ వచ్చిన సమయంలో మ్యూట్ చేసినట్లు తెలిసింది. సమస్యని పరిష్కరించాక కూడా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

బెదిరింపు కాల్స్
వివాదాస్పద లిరిక్స్ వద్ద మ్యూట్ లో ఉంచి ప్రదర్శిస్తున్నాం. అయినా కూడా నాకు కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంతే కాకుండా తన ఫోన్ నంబర్ ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని ఆమె వాపోయారు.