twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లైమాక్స్ లో ‘ఏక్ నిరంజన్’

    By Staff
    |

    ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న 'ఏక్ నిరంజన్" చిత్రం ప్రస్తుతం థాయిలాండ్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమై ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యరామ్ నిర్మాత. 40 రోజుల పాటు సాగే ఈ క్లైమాక్స్ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు సోనూసూద్, ముకుల్ దేవ్ లు పాల్గొన్నారు. ఇది ప్రభాస్, పూరిజగన్నాథ్ల కాంబినేషన్లో రూపొందుతున్న రెండవ చిత్రం ఈ సారి ఖచ్చితంగా హిట్ కొడ్తానని ప్రభాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రభాస్ పెట్టుకొన్న ఈ అంచనాలు ఎంత వరకు నిజయవుతాయో వేచి చూడాల్సిందే. ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతత్వంలో ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 15 తర్వాత జరిగే షూటింగ్ కోసం హైదరాబాద్ లో దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ ను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X