Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒకేసారి మూడు సీక్వెల్ చేస్తున్న హీరో
సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్రాన్ హష్మి తాజాగా మూడు చిత్రాల సీక్వెల్ లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. ఆ చిత్రాలు మర్డర్, జన్నత్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎ ముంబై. ఈ మూడు భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినవే. ఈ విషయమై ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ..వన్స్ అపాన్ ఇన్ ముంబై సీక్వెల్ స్క్రిప్టు రెడీ అయిపోయింది. అతి త్వరలోనే మొదలవుతుంది. జన్నత్ విషయానికి వస్తే వచ్చే జనవరిలో ప్రారంభమవుతుంది. కునాల్ దేశముఖ్ ఈ చిత్రానికి స్క్రిప్టు చేసాడు. జన్నత్ కన్నా అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ మారి మరో ఫీల్డ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చర్చ ఉంటుంది. ఇక నాకు ఇండస్ట్రీలో గుర్తిపు తెచ్చిన చిత్రం ఏమిటీ అంటే మర్డర్ అని క్లియర్ గా చెప్తాను. దాంతో ఆ సీక్వెల్ మీద నాకు కాస్త మక్కువ ఎక్కువే. నవంబర్ నుంచీ షూటింగ్ ఉంటుంది. మల్లికా షెరావత్ ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్ అన్నాడు. ప్రస్తుతం క్రూక్ అనే చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉందని, ఆ చిత్రం ఆస్ట్రేలియాలోని జాతి వివక్షతపై తీసిన చిత్రమని పేర్కొన్నాడు.