Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డ్రగ్స్ కేసులో పూరీ, రకుల్ ప్రీత్, రానా, ఛార్మీ, రవితేజకు నోటీసులు.. మనీలాండరింగ్ కోణంలో ఈడీ కొరడా!
నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ తారలకు చుక్కెదురైంది. గతంలో విచారణకు హాజరైన సినీ ప్రముఖులు రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, పూరీ జగన్నాథ్కు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన 12 మంది నటీనటులు, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అయితే ఎవరెవరికి, ఎప్పడు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారంటే..
ఆఫ్రికా దేశస్థుడి అరెస్ట్తో గుట్టురట్టు
హైదరాబాద్లో ఉన్నత, సంపన్న వర్గాలకు డ్రగ్స్ను సరఫరా చేస్తున్న రాకెట్ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆఫ్రికా దేశానికి సంబంధించిన రాఫెల్ అలెక్స్ విక్టర్ను అరెస్ట్ చేయడం, అతడి ఫోన్లు, వాట్సప్ చాట్స్ను పరిశీలించడంతో సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి. ముంబై నుంచి కొకైన్ తదితర నిషేధిత మాదక ద్రవ్యాలను హైదరాబాద్కు చేరవేసినట్టు విచారణలో బయటపడింది.
12 మంది సినీ ప్రముఖుల విచారణ
ఈ క్రమంలో తెలంగాణలోని టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో లింకులు ఉన్న ఆన్లైన్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో 2017లో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించారు. వీరంతా తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కేసు విచారణ హడావిడి తగ్గింది. ఆ సమయంలో చార్జిషీట్ కూడా ఫైల్ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.
వెంట్రుకలు, చేతి వేళ్ల ఆధారంగా గుర్తింపు
అయితే 2017లో సిట్ అధికారులు సినీ తారల నుంచే కాకుండా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, చేతి వేళ్ల గోర్ల శాంపిల్స్ను సేకరించారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో తొలిసారి వెంట్రుకల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. ఇలా డ్రగ్స్ కేసులో వెంట్రుకల ద్వారా మాదక ద్రవ్యాలు సేవించారా లేదా అనే విషయాన్ని దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.
బెంగళూరు డ్రగ్స్ రాకెట్ వ్యవహారంతో
బెంగళూరులోని డ్రగ్స్ రాకెట్ వ్యవహారానికి సంబంధించిన సెలబ్రిటీల మూత్రం, రక్తం, వెంట్రుకల నమూనాలను హైదరాబాద్లో పరీక్షించారు. ఈ సందర్బంగా కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ డ్రగ్స్ తీసుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవి తేజ, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, ముమైత్ ఖాన్ తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా అధికారులు వెల్లడించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు 31న పూరి, సెప్టెంబర్ 6న రకుల్...
డ్రగ్స్ కేసుతోపాటు మనీ లాండరింగ్ కోణం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం.. పూరీ జగన్నాథ్ను ఆగస్ట్ 31వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారని, అలాగే సెప్టెంబర్ 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8 తేదీన రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9వ తేదీన రవితేజ, ముమైత్ ఖాన్ను సెప్టెంబర్ 15వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే ఛార్మీ కౌర్ను కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది.