Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇలియానా, కేథరిన్ అయిపోయారు.. రాంచరణ్ కోసం ఇంటర్నెట్ సెన్సేషన్ని పట్టేశారు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. చరణ్ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. హీరోలోని మాస్ యాంగిల్ ని బయటకు తీయడంలో బోయపాటికి ప్రత్యేక శైలి ఉంది. గతంలో బోయపాటి మెగాహీరో అల్లు అర్జున్ తో తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగి నటించాడు. దీనితో వినయ విధేయరామ చిత్రం నుంచి కూడా మెగా అభిమానులు అదే ఆశిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, ఐటెం సాంగ్ ఇలా మాస్ జనాలు కోరుకునే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి.
ఇలియానా, కేథరిన్ అన్నారు
బోయపాటి చాలా రోజులుగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు. మొదట్లో ఇలియానా, రాంచరణ్ తో కలసి స్టెప్పులేయబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ అడగ్గడంతో దర్శకుడు ఇలియానాని పక్కన పెట్టారు. ఆ తరువాత కేథరిన్ పేరు వినిపించింది. ఈ అమ్మడు కూడా ఫైనల్ కాలేదు. ఆ మధ్యన రకుల్ ప్రీత్ ని సంప్రదించారు అని కూడా వార్తలు వచ్చాయి.
ఆలస్యం అయినా
ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ని ఎంపిక చేయడం ఆలస్యమైనా సెన్సేషనల్ బ్యూటీని ఫైనల్ చేశారు. అర్థ నగ్న ఫోటో షూట్ తో ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఇషా గుప్తని ఐటెం సాంగ్ కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇషా గుప్త ఘాటు ఫోటో షూట్స్ తోనే యువతలో క్రేజ్ తెచ్చుకుంది. కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో యువతకు మతి పోగొట్టే ఏఈ భామ వినయ విధేయ రామ చిత్రంలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
రెండు పాటలతో ఫినిష్
ఇషా గుప్త, రాంచరణ్ పై తెరకెక్కించే ఐటమ్ సాంగ్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి పార్రంభం అవుతుంది. రెండు మూడు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేస్తారు. డిసెంబర్ 18న కైరా అద్వానీ, చరణ్ పై డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరిస్తారు. ఈ పాట చిత్రీకరణ ఆదిలాబాద్ లో జరగనున్నట్లు సమాచారం డిసెంబర్ 22 తో వినయ విధేయ రామ షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. పార్లల్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భారీ అంచనాలతో సంక్రాంతికి
భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. టీజర్ కు, ఇటీవల విడుదలైన తొలి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.