Don't Miss!
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
పవన్ పార్టీ సభపై పోలీసుల ఆంక్షలు
శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8గంటల మధ్య హైదరాబాద్ హైటెక్స్ వేదికగా పవన్ 'జనసేన' ఆవిర్భవించనుంది. పూర్తి తెలుపుపై ఎర్రని చక్రంలో అదే రంగు నక్షత్రాన్ని (షట్ చక్రం) ముద్రించి... పార్టీ జెండాను రూపొందించారు. అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తేలా 'జనసేన' గీతాన్ని రూపొందించారు. ఎన్నికల గుర్తుగా వట వృక్షాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాద్ సహా రాష్ట్రంలో 28 చోట్ల భారీ తెరలతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం బహిరంగ మైదానాలను, ఫంక్షన్ హాళ్లను ఎంచుకున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశముంది.
పవర్ స్టార్ తన పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఒక్కరోజు ముందే... జెండా, నినాదం, గీతం అన్నీ అనధికారికంగా విడుదలయ్యాయి. అంతేకాదు.. పార్టీ ఆవిర్భావానికి ముందే 'మెగా' కుటుంబంలో చిచ్చు మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు ఒక 'వీడియో ప్రకటన' విడుదల చేశారు. బ్యాక్గ్రౌండ్లో 'ఠాగూర్' సినిమాలోని 'నేను సైతం ప్రపంచాగ్నికి...' పాట మంద్రంగా వినిపిస్తుండగా నాగబాబు మాట్లాడారు.
'ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా... నేను, అభిమానులందరం అన్నయ్య చిరంజీవి వెంటే ఉన్నాం. అన్నయ్యా... వియ్ ఆర్ విత్ యూ' అని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి అభిమానులెవరూ రావొద్దంటూ తన పేరిట ఆదేశాలు వెళ్లినట్లు వచ్చిన వార్తలను చిరంజీవి ఖండించారు. ఇక... చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచిన కాపులు, పవన్ పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తుండటం గమనార్హం.