Don't Miss!
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆరే ఎవర్ గ్రీన్!
తెలుగు సినిమాకు ఎఎన్ ఆర్, ఎన్టీఆర్ రెండు కళ్లు". చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పే మాట ఇది. నటనలో హావబావాల్లో ఎవరి శైలి వారిది. కామన్ హీరోగా ఎన్టీఆర్, క్లాస్ హీరోగా అక్కినేని ప్రజాదారణ చూరగొన్నారు. అయితే పాపులారిటీలో మాత్రం ఎన్టీఆర్ దే పై చేయి. కష్ణుడిగా, రాముడిగా ఆయన తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా నిలిచారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజా సంఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. గోల్డ్ స్టోన్ సంస్థ తెలుగు బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ ను కలర్ లోకి తీసుకొస్తోంది.
తాజాగా మాయాబజార్ ను కలర్ లోకి తీసుకొచ్చి, ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, చాలా అద్భుతంగా మంచి కలెక్షన్ల తో నడుస్తోంది. త్వరలో 11 చిత్రాలను కలర్ లోకి తీసుకురానుంది. అందులో ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన గుండమ్మకథ, మిస్సమ్మ మినహాయిస్తే, అక్కినేని చిత్రం ఒక్కటి లేకపోవడం గమనార్హం. కలర్ లోకి తెచ్చే 'షావుకారు", ఉమాచండీగౌరీశంకరుల కథ", సత్యహరిశ్చంద్ర", సిఐడి,'పెళ్లిచేసి చూడు", ఇలా అన్ని చిత్రాల్లోనూ కథానాయకుడు ఎన్టీఆరే కావడం విశేషం. అక్కినేనిని స్టార్ హీరో చేసిన 'దేవదాసు" ఈ లిస్ట్ లో లేకపోవడం విచిత్రం. ఈ లెక్కన అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎన్టీఆరే ఎవర్ గ్రీన్.