Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ సదుపాయాన్ని అందరూ వినిమోగించుకోండి : బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ వాళ్శ అమ్మ గారి పేరు మీద స్దాపించినటువంటి నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా వ్యవహారిస్తున్న విషయం అందరికి తెలిసిందే. బాలయ్య బాబు చైర్మన్ అయిన తర్వాత రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా 16 లక్షల పెట్టి సైటోజెనిక్ అనే ఎక్విప్ మెంట్ ను తెప్పించడం జరిగిందన్నారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఈ అత్యాధునిక పరికరం గల ఏకైక హాస్పిటల్ ఇదోక్కటేనని ఆయన వివరించారు. ఈ ఎక్విప్ మెంట్ వల్ల ఈ హాస్పిటల్ కు మంచి పేరు రావడమే కాకుండా, ఇక్కడ ఉన్న రోగులు వేరే ఏ హాస్పటల్ కు వెళ్శకుండా ఇక్కడే పరీక్షలు నిర్వహించుకోవచ్చుని ఆయన తెలిపారు. దీనితోపాటు సికింద్రాబాద్ నుండి నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వరకు తన సోంత ఖర్చులతో ఒక స్పెషల్ బస్సు వేయడం జరిగిందన్నారు. ఈ బస్సును నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసేటటువండి సిబ్బంది మరియు రోగులు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కూడా రోగులకు ఉచిత ఆరోగ్యసేవలు అందిస్తారని అన్నారు. ఇలా సేవలు అందించడం వల్ల, ప్రజలకు బాగా దగ్గర అవ్వవచ్చని బాలయ్య బాబు కు ఆయన శ్రేయేభిలాసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య బాబు దాసరి దర్శకత్వంలో పరమవీరచక్ర సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.