Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
200 సార్లు ఈ కథ చదివి తీస్తున్నా..ఇవివి
ఈ సినిమాకి దాదాపు 18 వెర్షన్స్ రాసాం. దాదాపు 200 సార్లు ఈ కథ చదువుకుని ఉంటాను. చదివిన ప్రతిసారీ నవ్వుకున్నాను అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ. ఆయన తాజాగా తన కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా 'బురిడి'. 'తెగ నవ్వించేత్తాడు' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల బ్యాంకాక్ లో జరిగింది. ఈ విశేషాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఈవీవీ మాట్లాడుతూ...పై విషయాలను ప్రస్దావించారు. అలాగే ఎడిటర్ గౌతంరాజు సాధారణంగా నవ్వడం జరగదనీ, ఈ సినిమా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రతి సన్నివేశానికి నవ్వారనీ, దాంతో వంద శాతం ఈ చిత్రం విజయం సాధిస్తుందని అనిపించిందనీ చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్ర ప్రేక్షకులు తనకో అదృష్టాన్ని, వరాన్ని ఇచ్చారనీ, 'అప్పుల అప్పారావు' నుంచి 'బెండు అప్పారావు' వరకూ తాను తీసిన కామెడీ చిత్రాలను వాళ్లు సూపర్ హిట్ చేసారనీ అన్నారు. అందుకే కామెడీ సినిమా చేసిన ప్రతిసారి చాలా శ్రద్ధ తీసుకుని బాగా నవ్వించడానికి తగిన కృషి చేశానని తెలిపారు. కోటి మంచి మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసి, వేసవి కానుకగా సినిమాని విడుదల చేస్తున్నారు.