Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డబ్బు దొంగిలించారు, రేప్ చేసారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
హైదరాబాద్: బాలీవుడ్ నటి, బిగ్ బాస్ షో మాజీ పోటీ దారు పూజా మిశ్రా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని ఆదర్శ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. గత వారం పూజా మిశ్రా ఫోటో షూట్ కోసం జైపూర్ వచ్చింది. ఇక్కడే ఓ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తనపై అఘాయిత్యం జరిగినట్లు ఆమె ఆరోపించారు.
హోటల్ లో బస చేసిన తర్వాత తన వద్ద ఉన్న రూ. 2 లక్షలు పోయాయని, అందుకు కారణంగా సెలూన్ ఓనర్ రితూ దేశ్వాల్ అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఫోటో షూట్ కోసం ప్రిపేర్ అవ్వాలని ఓ సెలూన్ కు వెళ్లగా ఈ వెంట్ ఆర్గనైజర్ తన బిల్లు డబ్బులు మరింత ఎక్కువ చేయాలన్న ఉద్దేశ్యంతో రెండు గంటల పాటు ఈవెంట్ ఆలస్యం చేసారని ఆరోపించారు.
హరీష్, మోసిన్, సుహాన్ అనే ముగ్గురు వ్యక్తులు ఫోటో షూట్ చేసిన పుటేజీ ఇవ్వడానికి చాలా ఎక్కువ డబ్బు డిమాండ్ చేసారని, బ్లాక్ మెయిల్ చేసారని, అందుకు తాను అంగీకరించలేదని.... ఆ కోపంతో జూన్ 13న తాను తిన్న ఆహారంలో డ్రగ్స్ కలిపి తనపై లైంగిక దాడి ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొంది. పూజా మిశ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376(రేప్), 384(బ్లాక్ మెయిల్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అయితే రితూ దేశ్వాల్ వాదన మరోలా ఉంది. ఆమె తమ స్టాఫ్ తో అమర్యాదగా ప్రవర్తించిందని, తన పర్మిషన్ లేకుండా సెలూన్ నుండి కొన్ని వస్తువులు చోరీ చేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ కేసులో నిజా నిజాలు తేల్చే ప్రయత్నం చేస్తున్నారు.