Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నితిన్ సినిమాలో ఛాన్స్.. 3 లక్షలు దండుకుంటున్న వాట్సాప్ ముఠా గుట్టురట్టు!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి చిత్రం వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు వెంకీ కుడుముల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నితిన్ సినిమాలో ఛాన్స్
ఓ నెటిజన్ వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ విషయాన్ని వెంకీ కుడుముల దృష్టికి తీసుకుని వచ్చాడు. నితిన్, వెంకీ కుడుముల చిత్రం కోసం చెన్నైలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఎంపికైతే మంచి పాత్రలో నటించే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఫోటోలు, వివరాలు పంపాలని వాట్సాప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో దాగున్న మోసం ఏంటంటే ఆడిషన్స్ లో పాల్గొనేందుకు ముందుగా జూనియర్ ఆర్టిస్టులుగా లైసెన్స్ తీసుకోవాలి. అందుకు 3 లక్షల ఫీజుకట్టాలి అని వైరల్ చేస్తున్నారు.
|
నిజమేనా
ఓ నెటిజన్ ఈ సందేశాన్ని దర్శకుడు వెంకీ కుడుముల దృష్టికి తీసుకుని వచ్చాడు. వెంకీ కుడుముల స్పందిస్తూ.. ఇది అంతా ఫేక్. తాము ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేదు అని తేల్చేశాడు. ఇలాంటి ఆన్లైన్ ముఠా పట్ల జాగ్రత్తగా ఉండాలనివెంకీ కుడుముల సూచించాడు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే మధ్యవర్తలు చాలా మందే ఉన్నారు. నిజమేనేమో అని నమ్మే అమాయకులు వీరి వలలో పడుతున్నారు.
రష్మిక హీరోయిన్
ఈ చిత్రంలో నితిన్ సరసన తొలిసారి హాట్ బ్యూటీ రష్మిక నడిచేందుకు సిద్ధం అవుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా, వినోదం ఎక్కువ ఉండేలా వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వెంకీ తెరకెక్కించిన ఛలో చిత్రంతోనే రష్మిక టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది. నితిన్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం కానుంది.
మరో దర్శకుడితో
నితిన్ భీష్మ చిత్రంతో పాటు మరో యువ దర్శకుడి చిత్రానికి కూడా ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బీష్మ చిత్రం ప్రారంభమైన తర్వాత ఆ చిత్రం కూడా ప్రారంభమవుతుంది. రెండు చిత్రాల షూటింగ్ కాస్త అటూఇటూ గా ఒకేసారి జరగబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం చిత్రం గత ఏడాది ఆగష్టులో విడుదలయింది. ఆ తర్వాత నితిన్ కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు.