twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ గుడి కోసం కిడ్నీ అమ్మకానికి అభిమాని

    By Bojja Kumar
    |

    NTR
    హైదరాబాద్ : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామరావు. వెండితెరపై నటనతో మాత్రమే కాదు...సమర్థ వంతమైన రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన కోసం అభిమానులు గుడి కట్టడానికి సిద్ధమయ్యారంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    తాజాగా ఓ అభిమాని ఆయన కోసం గుడి నిర్మించడానికి కిడ్నీలను అమ్మకానికి సిద్ధమయ్యాడు. గుడి నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన పెనుమచ్చ శ్రీనివాసులు ఎన్టీఆర్‌కు వీరాభిమాని.

    శ్రీనివాసులు తన స్వగ్రామంలో ఎన్టీఆర్ కోసం ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. తిరుపతి నుంచి విగ్రహాన్ని తెప్పించి గుడిలో పెట్టారు. అయితే శ్రీనివాసులకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆలయ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరూ ముందుకు రాకపోవడం లేదు.

    దీంతో తన కిడ్నీలు అమ్మి అయినా ఆలయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు శ్రీనివాసులు. కిడ్నీలు అవసరమైన వారు ఎవరైనా తనను సంప్రదిస్తే ఇస్తానంటున్నాడు. ఈ విషయం మీడియా ద్వారా రాష్టమంతటా ప్రచారం కావడంతో....శ్రీనివాసులు వీరాభిమానం చూసి ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    An ardent fan of Legend NTR has decided to put his kidney on sale to finish construction of a temple he started for NTR. Penumacha Srinivasulu from Tottembedu, Chittoor district is the hardcore fan who had started to build the temple, he had even got a statue of NTR to keep in the temple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X