Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ అభిమాని నీచమైన పని చేసాడంటున్న నిఖిత
హైదరాబాద్: సాంకేతిక రంగం అభివృద్ది చెందిన తర్వాత సినిమా స్టార్లు, అభిమానుల మధ్య దూరం చాలా తగ్గి పోయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లయిన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటున్నారు స్టార్స్. ఇదంతా ఒక నాణేనికి ఒక వైపు మాత్రమే. వీటి వల్ల స్టార్స్ పలు సందర్భాల్లో ఇబ్బంది కూడా పడుతున్నారు. కొందరైతే ఏకంగా సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ సైతం క్లోజ్ చేసారు.
తాజాగా హీరోయిన్ నిఖితకు ట్విట్టర్లో ఓ అభిమాని నుండి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అసభ్యకరమైన ఫోటోలు పంపాడు. అంతటితో ఆగకుండా ఇబ్బందికర వ్యాఖ్యలు కూడా చేసాడు. ఈ విషయాన్ని నిఖిత మీడియా దృష్టికి తీసుకొచ్చింది. అభిమానులు అభిమానుల్లా ఉండాలి. ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని నిఖిత హెచ్చరించింది.
ఆమె సినిమాల విషయానికొస్తే....తెలుగు సినిమా ‘హాయ్' ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత ‘కళ్యాణ రాముడు', సంబరం, ఖుషీ ఖుషీగా, ఏమండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, డాన్, అనసూయ, భద్రాద్రి, చింతకాయల రవి, అపార్టుమెంట్ చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవును-2' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణె, పూర్ణ, సంజన తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.