Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పోట్లాటకు రెడీ అయిన బాలయ్య, నాగార్జున అభిమానులు
తిరుపతి: డిక్టేటర్, సోగ్గాడే చిన్న నాయన చిత్రాల విడుదల నేపథ్యంలో బాలకృష్ణ, నాగార్జున అభిమానులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పోట్టాటకు కూడా సిద్ధపడ్డారు. తిరుపతిలోని గ్రూప్ థీయేటర్స్లో ప్రక్క ప్రక్కనే ఈ సినిమాలు ఆడుతున్నాయి.
తమ హీరో సినిమా బాగుందంటే తమ హీరో సినిమా బాగుందంటూ బాలకృష్ణ, నాగార్జున అబిమానులు కొట్లాటకు దిగార. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అక్కడున్న కొందురు ఇరువురికి నచ్చ చెప్పి గొడవ సద్దుమణిగేలా చేసారు.
టాలీవుడ్ టాప్ హీరోలుగా ఉన్న బాలయ్య , నాగార్జున సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తున్నాయి. బాలయ్య నటించిన డిక్టేటర్ చిత్రం మాస్ మూవీగా తెరకెక్కగా, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకులను మరింత అలరిస్తోంది.
డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు రెండు అభిమానులను ఆకట్టుకుంటుండగా , ఈ చిత్రాలకు ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. మంచి కథ దొరికితే బాలయ్యతో మల్టీ స్టారర్ చేస్తానని ఇటీవల నాగార్జున చెప్పగా, ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొందరిని భాదిస్తోంది.