Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు కోసం అల్లాడిపోతున్న పంజాబీ అభిమానులు.. కనీసం ఇక నుంచి అయినా!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలో మహేష్ బాబుకు అశేషమైన అభిమానగణం ఉంది. ముఖ్యంగా యువతులు మహేష్ బాబు అంటే పడి చస్తారు. అభిమానులు ప్రిన్స్ గా పిలిచే మహేష్ అంత అందగాడు మరి. క్రమంగా మహేష్ బాబుకు నార్త్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది. సినిమా డిజిటల్ మార్కెట్ లోకి కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో మహేష్ బాబు చిత్రాలు నేరుగా కాకపోయినా ఏదో ఒక డిజిటల్ ఫార్మాట్ లో హిందీలో డబ్ అయి విడుదల అవుతున్నాయి. ఆసక్తికరంగా పంజాబీ అభిమానులు మహేష్ చిత్రాల కోసం కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారట.
హిందీలో విడుదల
ఇప్పటివరకు మహేష్ నటించిన చాలా చిత్రాల్లో డిజిటల్ ఫార్మాట్ లో హిందీలో డబ్ అయ్యాయి. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో మహేష్ చిత్రాలకు మంచి స్పందన వస్తూ ఉంటుంది. కానీ పంజాబ్ అభిమానులు మహేష్ సినిమాలకు ఫిదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ నటించిన చిత్రాలు పంజాబ్ అభిమానులని తెగ కట్టుకుంటున్నాయట. కానీ అవి హిందీలో మాత్రమే డబ్ కావడం, పంజాబీలో లేకపోవడంతో అక్కడి అభిమానులు మహేష్ చిత్రాలని పూర్తిగా ఆస్వాదించలేకున్నారు.
ఇక నుంచి అయినా
పంజాబ్ ఫాన్స్ నుంచి మహేష్ బాబుకు చాలా రిక్వస్ట్ లు వస్తున్నాయట. కనీసం ఇక నుంచి అయినా మహేష్ నటించే చిత్రాలని పంజాబీలో డబ్ చేయాలనీ కోరుతున్నారు. మహేష్ బాబు ప్రతి చిత్రంలో తన పాత్రకు ప్రాణం పోసేలా నటించడం పంజాబీ అభిమానులని ఆకట్టుకుంటోంది. ఆదరణ ఎక్కువగా ఉన్న చోట అభిమానులని మరింతగా ఆకట్టుకోవాలి. మహర్షి చిత్రం చాలా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
సత్తా చాటుతున్నారు
ప్రస్తుతం తెలుగు హీరోలు కూడా దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ప్రభాస్ కు బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా తెచ్చిపెట్టింది. ఇక అల్లు అర్జున్ మలయాళంలో ఒక స్టార్ గా మారిపోయాడు. మహేష్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడితే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లుక్స్ పరంగా మహేష్ బాబు బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నే విధంగా ఉంటాడు. కానీ మహేష్ ఎప్పుడూ టాలీవుడ్ పరిధి దాటి ప్రయత్నించలేదు.
వంశీ పైడిపల్లి దర్శత్వంలో
మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రైతుల సమస్యలు ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.