twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు కోసం అల్లాడిపోతున్న పంజాబీ అభిమానులు.. కనీసం ఇక నుంచి అయినా!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలో మహేష్ బాబుకు అశేషమైన అభిమానగణం ఉంది. ముఖ్యంగా యువతులు మహేష్ బాబు అంటే పడి చస్తారు. అభిమానులు ప్రిన్స్ గా పిలిచే మహేష్ అంత అందగాడు మరి. క్రమంగా మహేష్ బాబుకు నార్త్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది. సినిమా డిజిటల్ మార్కెట్ లోకి కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో మహేష్ బాబు చిత్రాలు నేరుగా కాకపోయినా ఏదో ఒక డిజిటల్ ఫార్మాట్ లో హిందీలో డబ్ అయి విడుదల అవుతున్నాయి. ఆసక్తికరంగా పంజాబీ అభిమానులు మహేష్ చిత్రాల కోసం కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారట.

     హిందీలో విడుదల

    హిందీలో విడుదల

    ఇప్పటివరకు మహేష్ నటించిన చాలా చిత్రాల్లో డిజిటల్ ఫార్మాట్ లో హిందీలో డబ్ అయ్యాయి. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో మహేష్ చిత్రాలకు మంచి స్పందన వస్తూ ఉంటుంది. కానీ పంజాబ్ అభిమానులు మహేష్ సినిమాలకు ఫిదా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ నటించిన చిత్రాలు పంజాబ్ అభిమానులని తెగ కట్టుకుంటున్నాయట. కానీ అవి హిందీలో మాత్రమే డబ్ కావడం, పంజాబీలో లేకపోవడంతో అక్కడి అభిమానులు మహేష్ చిత్రాలని పూర్తిగా ఆస్వాదించలేకున్నారు.

    ఇక నుంచి అయినా

    ఇక నుంచి అయినా

    పంజాబ్ ఫాన్స్ నుంచి మహేష్ బాబుకు చాలా రిక్వస్ట్ లు వస్తున్నాయట. కనీసం ఇక నుంచి అయినా మహేష్ నటించే చిత్రాలని పంజాబీలో డబ్ చేయాలనీ కోరుతున్నారు. మహేష్ బాబు ప్రతి చిత్రంలో తన పాత్రకు ప్రాణం పోసేలా నటించడం పంజాబీ అభిమానులని ఆకట్టుకుంటోంది. ఆదరణ ఎక్కువగా ఉన్న చోట అభిమానులని మరింతగా ఆకట్టుకోవాలి. మహర్షి చిత్రం చాలా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

    సత్తా చాటుతున్నారు

    సత్తా చాటుతున్నారు

    ప్రస్తుతం తెలుగు హీరోలు కూడా దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ప్రభాస్ కు బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా తెచ్చిపెట్టింది. ఇక అల్లు అర్జున్ మలయాళంలో ఒక స్టార్ గా మారిపోయాడు. మహేష్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడితే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లుక్స్ పరంగా మహేష్ బాబు బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నే విధంగా ఉంటాడు. కానీ మహేష్ ఎప్పుడూ టాలీవుడ్ పరిధి దాటి ప్రయత్నించలేదు.

     వంశీ పైడిపల్లి దర్శత్వంలో

    వంశీ పైడిపల్లి దర్శత్వంలో

    మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రైతుల సమస్యలు ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Fans request Mahesh Babu to dub his films in Punjabi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X