శ్రీదేవి మృతిలో బయటపడని నిజం..అంతా చెబుతున్నారు, స్పృహలో లేకుండా!
Recommended Video

అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం చెందారు. ఆమె మృతి సినిలోకానికి తీరని లోటు. ప్రముఖులంతా శ్రీదేవి మృతి పట్ల సంతాపం తెలియజేసి ఆమె నటిగా సాధించిన విజయాల్ని కొనియాడారు. అంతా చెబుతున్నారు. కానీ శ్రీదేవి మృతి విషయంలో నెలకొని ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు. శ్రీదేవి బాత్ టబ్ లో మూర్తి చెందినట్లు తెలిపారు. కానీ శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోతే గాయం కావాలి అంతే కానీ స్పృహ కోల్పోయి మృతి చెందేంతగా ఏం జరిగిందని మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు. ఇదే ప్రశ్నని సోషల్ మీడియా వేదికగా శ్రీదేవి అభిమానులు అడుగుతూ నిలదీస్తున్నారు.

ఉహించని విధంగా దుబాయ్ లో
మేనల్లుడి పెళ్లికోసం వెళ్లిన శ్రీదేవి అక్కడ సరదాగా గడిపింది. కానీ వివాహం ముగిసాక కూడా శ్రీదేవి అక్కడే హోటల్ లో బసచేశారు. కానీ అనూహ్యంగా బాత్ టబ్ లో మరణించారు.

అంతా చెబుతున్నారు
శ్రీదేవి మృతితో ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ శ్రీదేవి సాధించిన విజయాల్ని గుర్తు చేస్తుకుంటున్నారు. శ్రీదేవితో వారికిగల అనుబంధన్ని వివరిస్తున్నారు. శ్రీదేవి గురించి అన్ని విషయాలు చెబుతున్నారు.

అసలు విషయం సంగతి ఏంటి
శ్రీదేవి బాత్ టబ్ లో ఎలా మరణించారు అనే ప్రశ్నకు ఎవరినుంచి కూడా సమాధానం లేదు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు నిలదీస్తున్న ప్రశ్న ఇది.

స్పృహ ఎలా కోల్పోయింది
బాట్ టబ్ లో పొరపాటున పడిపోతే గాయం కావలి. శ్రీదేవికి ఎలాంటి గాయమైనట్లు కానీ వైద్యుల నివేదికలో లేదు. కానీ బాత్ టబ్ లో పడిన వెంటనే స్పృహ ఎలా కోల్పోయింది అనే ప్రశ్న అభిమానులని వేధిస్తోంది.

అణచివేయబడ్డ రహస్యం
శ్రీదేవి మృతి విషయంలో నిజాల్ని అణచివేశారనే ఆరోపణ అభిమానులనుంచి నేరుగా వినిపిస్తోంది.

బాధతో వదిలేయాల్సిందేనా
శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మిగిలిపోవలసిందేనా. అభిమానులు ఇక శ్రీదేవి మృతి విషయాన్ని వదిలేయాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవిది సహజమరణం అయితే ఇంత రాద్దాంతం ఉండేది కాదు. కానీ ఆమె దేశం కానీ దేశంలో ఓ హోటల్ లో మరణించిన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆరోగ్య సమస్యలు కూడా లేవే
అతిలోక సుందరి శ్రీదేవి సినీతార అయినప్పటినుంచి ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు. ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. దీనితో శ్రీదేవి మృతి గురించి చర్చ ఆగడం లేదు.


Click it and Unblock the Notifications











