Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ హీరో చేతికి సైరా హక్కులు.. రాంచరణ్తో కళ్లు చెదిరే డీల్!
బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్ మరో దక్షిణాది చిత్రానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకోవడం హిందీ చలన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా నర్సింహారెడ్డి సినిమా హిందీ హక్కులను ఫర్హాన్ అఖ్తర్ సొంత సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకొన్నది. ఎక్సెల్ సంస్థ ఫర్హాన్, రితేష్ సిద్వానీ భాగస్వామ్యంతో నడుస్తున్నది.
ఇటీవల మెగా పవర్ స్టార్ రాంచరణ్తో ఎక్సెస్ సంస్థ సంప్రదింపులు జరిపి ఫ్యాన్సీ రేటుకు సైరా హిందీ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. బాలీవుడ్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి రాంచరణ్ సైరాను ఫర్షాన్ చేతికి అప్పగించినట్టు తెలిసింది. ఎంత మొత్తానికి సైరా హక్కులు అమ్ముడుపోయాయనే విషయం సీక్రెట్గా ఉంచినప్పటికీ.. రికార్డు ధరకు ఎక్సెల్ సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది.
కన్నడ హీరో నటించిన కేజీఎఫ్ చిత్రాన్ని గతంలో ఎక్సెల్ సంస్థ సొంతం చేసుకొన్నది. కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు వసూలు చేస్తే.. హిందీ వెర్షన్లో ఈ చిత్రం రూ.110 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
సైరా విషయానికి వస్తే.. స్వాతంత్ర సమరయోధుడి కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, అనుష్క తదితరులు నటిస్తున్నారు.