Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘జైబోలో తెలంగాణ’ నంది అవార్డుపై కోర్టుకు...
వేర్పాటు వాదంతో తీసిన ఈ చిత్రానికి ప్రకటించిన నంది అవార్డు పురస్కారాన్ని రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్లే అడుసుమిల్లి జయప్రకాష్ కోర్టు కెక్కారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తోనే సమస్యలు తీరుతాయని ఈచిత్రంలో చూపించారని, దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయని వెంటనే ఈ చిత్రానికి ప్రకటించిన అవార్డుతో పాటు, దర్శకుడు శంకర్ కి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకోవాలని పిటీషన్లో కోరారు.
ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 సంవత్సరానికి గాను 'జై బోలో తెలంగాణ'కు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు లభించింది. ఇదే చిత్రానికి ఎన్.శంకర్కు ఉత్తమ దర్శకుడి అవార్డు, గద్దర్కు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించాయి.
జైబోలో తెలంగాణ చిత్రానికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్, చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2011న విడుదలైంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.