సూసైడ్ నోట్లో భార్య గురించి రాసిన నటుడు (ఫోటోస్)
హైదరాబాద్: తమిళ టీవీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సాయి ప్రశాంత్ ఇటీవల నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. మద్యంలో విషయం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెల్చారు. సాయి ప్రశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియక పోయినప్పటికీ ఒంటరి తనం భరించలేకనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సాయి ప్రశాంత్ మూడు నెలల క్రితం మరో వివాహం చేసుకున్నారు. అయితే రెండో భార్యతో కూడా సాయి ప్రశాంత్ దాంపత్య జీవితం సరిగా సాగలేదని తెలుస్తోంది. అతనితో ఉండలేక కొన్ని రోజుల క్రితమే ఆమె వెళ్లి పోయిందని..... అప్పటి నుండి తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడని, ఒంటరి తనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.
తాజాగా సాయి ప్రశాంత్ సూసైడ్ నోట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సాయి ప్రశాంత్ చనిపోయే ముందు రాసినట్లు ప్రచారం జరుగుతున్న ఆ సూసైడ్ నోట్ లో అతను భార్య గురించి రావడం గమనార్హం.
స్లైడ్ షోలో సాయి ప్రశాంత్ లేఖలో రాసిన వివరాలు..

ప్రేమిస్తున్నాను
‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నా మరణం గురించి వర్రీ కావొద్దు. నీ మీద నా ప్రేమ.. నా మాటలన్నీ నిజం. ప్లీజ్ ఏడవొద్దు. నా చావుకు ఎవరూ కారణం కాదు.

కోపం తగ్గించుకో..
సుజిత నీ కోపం తగ్గించుకో. నా కూతురుకు మంచి నాన్నగా ఉండాలని భావిస్తున్నా. మిస్ యూ రక్షిత.

కట్నం
పెళ్లి సమయంలో మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కి ఇచ్చిన రూ.5లక్షల కట్నం.. బంగారు నగలు.. వాటిని మీ వాళ్లకు తిరిగి ఇచ్చేస్తారు.

ఎలాంటి సమస్యా రాదు
నా ఆత్మహత్య వల్ల నీకు కానీ (సుజిత).. మీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి సమస్యా రాదు.

వారికి థాంక్స్
నాకెన్నో అవకాశాలు ఇచ్చిన రాడాన్ మీడియా.. సన్ నెట్ వర్క్ కి థ్యాంక్స్ ' అంటూ సాయి ప్రశాంత్ తన సూసైడ్ నోట్ లో రాసారు.


Click it and Unblock the Notifications











