twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజీవ్ గాంధీ హత్య కుట్రపై రామ్ గోపాల్ వర్మ శిష్యుడు చిత్రం

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ దగ్గర..ఏక్ హసీనా ధీ, మిస్టర్ యా మిసెస్, నిశ్శబ్ద్ చిత్రాలకు అశోసియేట్ గా పనిచేసిన సురిందర్‌ హివరలే త్వరలో దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య నేపథ్యంతో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. పిబ్రవరి నెలాఖరులో గానీ, మార్చి మొదటివారంలో గానీ షూటింగ్ కి వెళ్ళే ఈచిత్రం ప్రముఖ పాత్రికేయుడు రాజీవ్‌ శర్మ రాసిన ఓ పుస్తకం ఆధారంగా చిత్ర కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై సురిందర్‌ హివరలే మాట్లాడుతూ...నేను గత తొమ్మిది నెలలుగా ఈ స్క్రిప్టు పనులోనే బిజీగా ఉన్నాను. పూర్తి సంతృప్తిగా స్క్రిప్టు వచ్చాకే షూటింగ్ కి వెళ్ళాలనుకున్నాను. ఆ దశ వచ్చింది. వర్మ శిష్యుడిగా నేను ఎప్పుడూ గర్వపడుతూంటాను. ఆయన గతంలో తీసిన కల్ట్ ఫిలింల తరహాలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. షూటింగ్ లో ఎక్కువ భాగం శ్రీలంక, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో జరుపుతాం. కథలో కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటలీలోనూ తెరకెక్కిస్తాను అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X