హైలెట్స్: నంది అవార్డుల వేడుక -2 (ఫొటోలతో)
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి లలిత కళాతోరణంలో ఘనంగా నిర్వహించిన 2011 చలనచిత్ర నంది పురస్కార వేడుకలో ఆయన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్ ప్రసంగం ప్రారరభిస్తూ స్వచ్ఛమైన తెలుగులో 'తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు' అనడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
ఎన్టీఆర్ భరత భూమికి గొప్ప బిడ్డ అని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిందీలో పునర్నిర్మించినప్పుడు తాను నటించానని అలాగే హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమాల్లో ఆయన నటించారని చెప్పారు. ఎన్టీఆర్తో తాను ఎన్నో విషయాలు చర్చించేవాడిననన్నారు. భారతీయ సినిమా వందో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దాదాసాహెబ్ ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర పేరుతో చిత్రాన్ని నిర్మించిన సంగతిని అమితాబ్ గుర్తు చేశారు.
హాజరుకాని పురస్కారగ్రహీతలు: బీఎన్ రెడ్డి జాతీయ పురస్కారానికి ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ని ఎంపిక చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన వేడుకకు హాజరు కాలేకపోయారు. నంది పురస్కారాలకు ఎంపికైన ఇళయరాజా, ప్రకాష్రాజ్, ఎస్.రవీందర్; ఉత్తమ చిత్రాల తరఫున పురస్కారాలు స్వీకరించాల్సిన బాపు, బాలకృష్ణ, శ్రీకాంత్, స్నేహ, కమలిని ముఖర్జీ, విజయేంద్రప్రసాద్లు వేడుకకు రాలేదు.
హాజరైన పురస్కారగ్రహీతలు నంది అందుకుంటున్న క్షణాలు ..స్లైడ్ షోలో... వీక్షించండి

మహేష్ అవార్డు అందుకుంటున్న వేళ..

గ్రీకు వీరుడుకి నంది

సింగర్ సునీత..

ముసి ముసి నవ్వులతో మహేష్...

స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంటూ ...రమేష్ ప్రసాద్...(రుషి)

దూకుడుతో సూపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకు..

సీతమ్మతల్లి నయనతారకు..

అమితాబ్ ..అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ..

బాలీవుడ్ సూపర్ స్టార్ కు సన్మానం

నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నిర్మాత జి.ఆదిశేషగిరిరావుకి

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్..హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రానికి...

నయనతార నంది అందుకుంటున్న వేళ

మంగళకు స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత ఛార్మి

రఘుపతి వెంకయ్య అవార్డును ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కు

దూకుడులో కామెడీ స్దంబం ఎమ్.ఎస్ నారాయణకు...

అనగనగా ఒక ధీరుడు విలన్ ..మంచు లక్ష్మి ప్రసన్న..

శ్రీరామరాజ్యం నిర్మాత..సాయిబాబు గారు..

అమితాబ్ కి సన్మానం..మన రామానాయుడు గారు చేతుల మీదుగా..

విభిన్న చిత్రాల దర్శకుడు నీలకంఠ..

ఈ పంక్షన్ లో టాలీవుడ్,బాలీవుడ్ సూపర్ స్టార్సే ప్రత్యేక ఆకర్షణ
నంది పురస్కారాల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రసంగించలేదు. నంది పురస్కారాల వేడుకలో ముఖ్యమంత్రి ప్రసంగం తప్పనిసరిగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు డి.రామానాయుడు, రాజశేఖర్, జీవిత, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, ప్రసాద్కుమార్, పితాని సత్యనారాయణ, ఎఫ్డీసీ ఎమ్డీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











