Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Acharya Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హైలైట్లు లీక్ చేసిన క్రిటిక్.. రేటింగ్ ఎంతంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా హవాను చూపిస్తూ.. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను అందించింది మెగా ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అయితే, వాళ్లు కలిసి నటించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన చిత్రమే 'ఆచార్య'.
మెగా మల్టీస్టారర్గా రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఇది మరో రెండు రోజుల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మరి దానిపై మీరూ లుక్కేయండి!
తండ్రి కొడుకుల మూవీ ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్తో కలిసి నటించిన చిత్రమే 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్లెస్ బ్లౌజ్తో అందాలన్నీ కనిపించేలా!
అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్
మెగా హీరోల కలయికలో రాబోతున్న మూవీ కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య'ను రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో కలిపి వంద కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది.
రిలీజ్కు రెడీనే.. ఆచార్య ట్రెండ్
'ఆచార్య' మూవీని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆచార్య సందడి క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సందడి మొదలైంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది.
SSMB28: మహేశ్ బాబు తండ్రిగా స్టార్ హీరో.. కుంభస్థలాన్నే టార్గెట్ చేసిన త్రివిక్రమ్
సందేశాత్మక కథతో రాబోతుంది
బడా డైరెక్టర్ కొరటాల శివ సినిమాలు సందేశాత్మకమైన కథతో తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ తీశారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని పూర్తి చేస్తాడట.
ఆచార్య మూవీపై ఉమైర్ ట్వీట్
పేరుకు తెలుగు సినిమానే అయినా 'ఆచార్య' దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా సామాన్య సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న టాప్ క్రిటిక్స్ దీని గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధు ఆచార్య మూవీపై ట్వీట్ చేశాడు.
Bigg Boss Non Stop: బాత్రూంలో చూశా నీవి తగ్గిపోయాయి.. బిందుపై అఖిల్ కామెంట్స్.. బయటపెట్టిన నాగ్
ఆచార్య హైలైట్ అంటూ రివ్యూ
తన రివ్యూలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉమైర్ సంధు తాజాగా ఆచార్య మూవీ గురించి ట్వీట్ చేశాడు. 'చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో ఎంటర్టైన్మెంట్ అదిరిపోయేలా ఉంది. ఇందులో మాస్ మసాలా సీన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈద్ పండుగ సమయంలో ఈ సినిమా రికార్డులు అన్నీ తిరగరాస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అని రివ్యూ ఇచ్చాడు.
రేటింగ్ ఎంత ఇచ్చాడో తెలుసా?
ఉమైర్ సంధు 'ఆచార్య' మూవీ హైలైట్ మాస్ కాంబోనే అని చెప్పేశాడు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత ఎక్కువగా పెంచేశాడు. అంతేకాదు, ఈ చిత్రానికి తన అభిప్రాయంలో ఐదుకు నాలుగు స్టార్లను రేటింగ్ ఇచ్చాడు. ఉమైర్ చేసిన ఈ ట్వీట్కు మెగా అభిమానుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఇది టాలీవుడ్లో హైలైట్ అవుతోంది.