Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు తరలివెళ్తుందా?
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ గుంటూరుకు తరలి వెలుతుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ సినీనటుడు అలీ. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే సినీ పరిశ్రమ గుంటూరుకు తరలిరానుందని తెలిపారు. సినిమా షూటింగులకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అలీ మాటలు అలా ఉంటే..ఎక్కువ సౌకర్యాలు ఉన్నందున పరిశ్రమ ఎక్కడీకి తరలి పోదని కొందరు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ అంటున్నారు. అయితే ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుందని బడా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు లాంటి వారు అంటున్నారు.
అప్పట్లో కొందరు వైజాగ్ ప్రాంతానికి సినీ పరిశ్రమ వస్తుందని అంచనాలు వేసారు. కొందరు అక్కడ భూములు కొనుగోలు చేసారు కూడా. అయితే ఆ మధ్య వచ్చిన తుఫానుతో అక్కడ సినీ పరిశ్రమ నెల కొల్పడం కష్ట సాధ్యమని తేలిపోయింది. తరచూ తుఫాన్ల బెడద ఉంటుంది కాబట్టి చాలా మంది సుముఖత చూపడం లేదు. అయితే హైదరాబాద్ లో సొంత స్టూడియోలు కలిగిన నాగార్జున, సురేష్ బాబు లాంటి వారు పరిశ్రమ ఇక్కడే స్థిరంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్...పరిశ్రమ ఇక్కడి నుండి తరలి పోకుండా ప్లాన్ చేస్తున్నారు. హైదారాబాద్ నగర శివారు ప్రాంతమైన రాచకొండ ప్రాంతంలో ఫిల్మ్ సిటీని నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు.