twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా మృతి

    By Staff
    |

    Tapan Sinha
    దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత,ప్రముఖ సినీ దర్శకుడు అయిన తపన్ సిన్హా(84) ఈ రోజు మరణించారు. దీర్ఘకాలికంగా bronco-pneumonia వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిస్టూట్ డిసెంబర్ ఆరున చేరారు. నిన్న రాత్రి(బుధవారం)నుండి ఆయన పరిస్ధితి చాలా సీరియస్ గా మారిందని,పల్స్ రేట్ పడిపోయిందని,మందులు పనిచేయలేదని ఉదయమే ప్రాణం విడిచారని డాక్టర్స్ తెలియపరిచారు.

    ఉపాహార్,సంగిన మహితో వంటి అధ్బుతాలు తీసిన తపన్ సిన్హా తన జీవిత కాలంలో పంతొనిమిది జాతీయ అవార్డులు పొందారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో రకరకాల అవార్డులు అందుకున్నారు. ఆయన తీసిన అంకుష్,ఏక్ డాక్టర్ కి మౌట్,సఫేద్ హాధీ,కాబులీవాలా వంటి సినిమాలను ఈ సందర్భంగా అభిమానులు తలుచుకుని బాధపడుతున్నారు. ఆయనకి ఓ కుమారుడు ఉన్నారు. భార్య,నటి అరుంధతి దేవి 1990లో మరణించారు. తపన్ సిన్హా తన జీవిత కాలంలో 26 సినిమాలను డైరక్ట్ చేస్తే...పది సినిమాలకు రచన చేసారు.నిర్మాతగా Anokha Moti (2000) సినిమాను నిర్మించారు. ఆయన మృతికి దట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X