Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
దళితులపై తమ్మారెడ్డి ఫైర్.. మంచి చిత్రాన్ని ఆదరించరా అంటూ అసహనం
కుల వివక్షపై సినీ విమర్శనాస్త్రం ఎక్కువపెడుతూ వెండితెరను తాకిన తాజా చిత్రం పలాస 1978. మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే మేధావుల ప్రశంసలు అందుకొన్న ఈ సినిమాపై సగటు ప్రేక్షకుడు పెద్దగా స్పందించడం లేదనే విషయాన్ని కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. తాజాగా జరిగిన థ్యాంక్స్ మీట్లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏమన్నారంటే..
Recommended Video
బాక్సాఫీస్ వద్ద పలాస 1978 చిత్రం
పలాస 1978 చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. దళితవాదంతో నిర్మించిన ఈ చిత్రానికి ఆ వర్గం నుంచి మద్దతు పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. దళిత సమస్యలను, వారికి జరిగిన అన్యాయాన్ని తెర మీద కళ్లకు కట్టినట్టు చూపించినప్పటికీ వారు సినిమాను పట్టించకపోవడంపై ప్రముఖులు ఆశర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మంచి సినిమాలు కావాలంటారు..
శనివారం జరిగిన థ్యాంక్స్ మీట్లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు.. అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాగా మారవు అంటారు.. కానీ పలాసలో వారి పాత్రలను హీరోలను చేశాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
చూడకపోతే మీ ఖర్మ
పలాస 1978 చిత్రంలో దళిత సమస్యలను చర్చించాం.. కానీ వారి నుంచే కనీస స్పందన కరువైంది. మీ సినిమాలు మీరు కూడా చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే.. మరిన్ని సినిమాలు వస్తాయి.. ఇది నా ఆవేదన.. నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే అని తమ్మారెడ్డి అన్నారు.
దళితుల సమస్యల నేపథ్యంగా
1970, 80 దశకాల్లో దళితులకు జరిగిన అన్యాయాలు, వారిపై జరిగిన దాడుల నేపథ్యంగా పలాస 1978 మూవీ తెరకెక్కింది. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రచయిత కరుణ కుమార్ ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడు ఆలోచింపజేసే విధంగా రూపొందించారు. ఈ సినిమాలో రక్షిత్, నక్షత్ర, తీరువీర్ ప్రధాన పాత్రలను పోషించారు.