ఎన్నికల నిబంధనలతో హీరోయిన్స్ కి దెబ్బ

ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటీనటులపై పార్టీలు చేసే ఖర్చుని కూడా ఆయా పార్టీల ఎన్నికల వ్యయం కింద పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెప్పటంతో సినీ తారలతో ప్రచారానికి నేతలు స్వస్తి పలికారు. నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో తారలతో ప్రచారం చేయించకపోవడం ఇదే మొదటిసారి. ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద రూ. 14 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. బాలీవుడ్ తారలతో ప్రచారం చేయడానికి అవరోధం ఏర్పడటంతో కాంగ్రెస్, భాజపాలు తమ పార్టీలకు చెందిన దిగ్గజాలతో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు.
సోనియాగాంధీ, రాహుల్గాంధీ, అజయ్మాకెన్, సచిన్పైలట్, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, రాజ్బబ్బర్ తదితరులు కాంగ్రెస్ తరపున స్టార్ ప్రచారకులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల చివరి నుంచి నరేంద్ర మోడీ, ఎల్.కె.అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, మురళీ మనోహర్ జోషి తదితరులు నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











