Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్నికల నిబంధనలతో హీరోయిన్స్ కి దెబ్బ
ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటీనటులపై పార్టీలు చేసే ఖర్చుని కూడా ఆయా పార్టీల ఎన్నికల వ్యయం కింద పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెప్పటంతో సినీ తారలతో ప్రచారానికి నేతలు స్వస్తి పలికారు. నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో తారలతో ప్రచారం చేయించకపోవడం ఇదే మొదటిసారి. ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద రూ. 14 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. బాలీవుడ్ తారలతో ప్రచారం చేయడానికి అవరోధం ఏర్పడటంతో కాంగ్రెస్, భాజపాలు తమ పార్టీలకు చెందిన దిగ్గజాలతో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు.
సోనియాగాంధీ, రాహుల్గాంధీ, అజయ్మాకెన్, సచిన్పైలట్, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, రాజ్బబ్బర్ తదితరులు కాంగ్రెస్ తరపున స్టార్ ప్రచారకులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల చివరి నుంచి నరేంద్ర మోడీ, ఎల్.కె.అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, మురళీ మనోహర్ జోషి తదితరులు నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.