twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల నిబంధనలతో హీరోయిన్స్ కి దెబ్బ

    By Srikanya
    |

    Film Stars not participating in This election
    ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బాలీవుడ్‌ నటుల సందడి కనిపించడం లేదు. తారలతో ప్రచారం చేయించడానికి భాజపా, కాంగ్రెస్‌ రెండు పార్టీలు వీడ్కోలు చెప్పాయి. గతంలో పార్టీల కోసం ప్రచారం చేయడంలో ఖుష్బూ, సునీల్‌షెట్టి, మహిమాచౌదరి, గోవిందా, గుల్షన్‌ గ్రోవర్‌, హేమమాలిని, ధర్మేంద్ర, చుంకీ పాండే, రాజేష్‌ ఖన్నా, రీనా రాయ్‌ తదితరులు కీలకపాత్ర వహించేవారు. ఈసీ ఎన్నికల వ్యయంపై కఠినమైన చర్యలు తీసుకోవటమే దీనికి కారణం.

    ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటీనటులపై పార్టీలు చేసే ఖర్చుని కూడా ఆయా పార్టీల ఎన్నికల వ్యయం కింద పరిగణిస్తామని ఎన్నికల సంఘం చెప్పటంతో సినీ తారలతో ప్రచారానికి నేతలు స్వస్తి పలికారు. నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో తారలతో ప్రచారం చేయించకపోవడం ఇదే మొదటిసారి. ప్రతీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద రూ. 14 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. బాలీవుడ్‌ తారలతో ప్రచారం చేయడానికి అవరోధం ఏర్పడటంతో కాంగ్రెస్‌, భాజపాలు తమ పార్టీలకు చెందిన దిగ్గజాలతో ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు.

    సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అజయ్‌మాకెన్‌, సచిన్‌పైలట్‌, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, రాజ్‌బబ్బర్‌ తదితరులు కాంగ్రెస్‌ తరపున స్టార్‌ ప్రచారకులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల చివరి నుంచి నరేంద్ర మోడీ, ఎల్‌.కె.అద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీ, మురళీ మనోహర్‌ జోషి తదితరులు నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.

    English summary
    BJP, Congress not intrested to publicity with FIlm Stars in this Election for cost Cutting. With the Delhi chief electoral officer (CEO) fixing the expenditure limit for every candidate at Rs 14 lakh. The Election Commission will informed all parties about the monitoring mechanism and the penal provisions for any violation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X