Don't Miss!
- Finance స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ నెస్లే చిన్న పిల్లల ఆహారం సెరెలాక్ లో చక్కెరను కలుపుతున్నట్లు కనుగొంది
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
మోక్షజ్ఞ గురించి నోరువిప్పిన బాలయ్య.. కొత్త చిత్రం బోయపాటితోనే!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం విడుదల అవుతోంది.బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మోక్షజ్ఞ కోసం
బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2017లోనే త్వరలో తన తనయుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ప్రకటించారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలయ్య మోక్షజ్ఞ గురించి ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.
వచ్చే ఏడాదే
బాలయ్య మాట్లాడుతూ.. మోక్షు లాంచింగ్ వచ్చే ఏడాది తప్పకుండా ఉంటుంది. కానీ ఇంతవరకు కథ డిసైడ్ చేయలేదు. మోక్షజ్ఞ కోసం ఇంకా ఎలాంటి కథా వినలేదు. మంచి కథ అనిపిస్తే అప్పటికప్పుడు వాడివేడిగా సినిమా ప్రారంభించడమే అని బాలయ్య అన్నారు. మోక్షజ్ఞ ప్రస్తుతం సినీ హీరోకి అవసరమైన డాన్సులు, ఫైట్స్ విషయంలో శిక్షణ పొందుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
బోయపాటితోనే
తన తదుపరి చిత్రం గురించి కూడా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. నా కొత్త సినిమా బోయపాటి దర్శత్వంలోనే ఉంటుందని తెలిపారు. కానీ ఆ సినిమా ప్రారంభం కావడానికి ఆలస్యం కావొచ్చు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఈ చిత్రం ప్రారంభం కావాల్సింది. కానీ త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఒకసారి షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత కొంత గ్యాప్ ఇవ్వడం సరైంది కాదు. అందుకే ఎన్నికల తర్వాత ప్రారంభించాలని అనుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.
పట్టుదలతో బోయపాటి
బోయపాటి తెరకెక్కించిన చివరి చిత్రం వినయ విధేయ రామ. రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంతో బోయపాటికి అనేక విమర్శలు ఎదురయ్యాయి. దీనితో బాలయ్యతో తెరకెక్కించే చిత్రం ద్వారా తిరిగిపుంజుకోవాలని బోయపాటి శ్రీను పట్టుదలతో ఉన్నాడు.