Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రేమ్ రక్షిత్ చంపేస్తున్నాడు బాబోయ్..ఎన్టీఆర్
ఓ గాడ్...జస్ట్ ఇప్పుడే ఓ టఫ్ స్టెప్ ని ఫినిష్ చేసా..ఈ ప్రేమ్ రక్షిత్ నన్ను చంపేస్తున్నాడు..బాబోయ్..అసలు ఇతన్ని పరిచయం చేసినందుకు రాజమౌళిని అనాలి అంటున్నాడు జూ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం కోసం ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫిలో ఓ పాట చేసారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో సరదాగా ఇలా స్పందించాడు. ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో ఈ పాట షూటింగ్ జరుగుతోంది. సమంత, కాజల్ కాంబినేషన్ లో ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్ లో సోమవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ పాటలో కొంత భాగం పూర్తి చేసుకుని తర్వాత అన్నపూర్ణలో వేసిన మరో గ్రాండ్ సెట్ లోకి మారి మిగతా పాటని చిత్రీకరిస్తారు. ఇక బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. కెమెరా ఛోటా కె.నాయుడు, సంగీతం ఎస్.ధామస్, పైట్స్ పీటర్ హెయిన్స్ ఈ చిత్రానికి సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.