Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'
దేశంలోనే 3డిలో వస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ మా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా తనీశ్ని బాలీవుడ్కు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం అని నిర్మాత రాజ్వర్మ తమ కొత్త చిత్రం 'ఓకే' గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్ సంతోష్ సమకూరుస్తున్నారు. ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో పరిచయమైన తనీష్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.దిష, అశ్విత హీరోయిన్స్ గా చేస్తున్నారు.
హీరో తనీశ్ మాట్లాడుతూ "నేనిప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. సైకిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కొత్త తనీశ్ని చూస్తారు" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రామానాయుడు స్టూడియోస్లో ఉగాది రోజు ప్రారంభమైంది. డి ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వివి వినాయక్ క్లాప్నివ్వగా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి దర్శకుల సంఘాధ్యక్షుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.