Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'
దేశంలోనే 3డిలో వస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ మా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా తనీశ్ని బాలీవుడ్కు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం అని నిర్మాత రాజ్వర్మ తమ కొత్త చిత్రం 'ఓకే' గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్ సంతోష్ సమకూరుస్తున్నారు. ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో పరిచయమైన తనీష్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.దిష, అశ్విత హీరోయిన్స్ గా చేస్తున్నారు.
హీరో తనీశ్ మాట్లాడుతూ "నేనిప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. సైకిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కొత్త తనీశ్ని చూస్తారు" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రామానాయుడు స్టూడియోస్లో ఉగాది రోజు ప్రారంభమైంది. డి ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వివి వినాయక్ క్లాప్నివ్వగా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి దర్శకుల సంఘాధ్యక్షుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.